Wednesday, 12 December 2018

శ్రీ శ్రీ శ్రీ అవదూత కాశినాయన ఫౌండేషన్

శ్రీ శ్రీ శ్రీ అవదూత కాశినాయన ఫౌండేషన్ 

శ్రీ శ్రీ శ్రీ అవదూత కాశినాయన ఫౌండేషన్ తరుపున్ననెల్లూరులో ఉన్నటువంటి మానసిక వికలాగులకు  అన్నదాన కార్యాక్రమము నిర్వహించాము 

ధ్వజస్థంభం పుట్టుక

ధ్వజస్థంభం పుట్టుక

మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.


అందరు తెలుసుకోవలసిన విషయం ఇది 

Sunday, 7 October 2018

ఓం శరవణభవ


కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్యుని లీల

అది 1972 వ సంవత్సరం

తమిళనాడు లోని పళని అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు.వారు పేర్లు పళనివేల్ , తారక మణి.ఇద్దరూ జీవనోపాధికై వ్యాపారాలు చేసేవారు.

పెళ్లినా ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగని కారణం చేత పళనివేల్ తల్లిదండ్రులు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతాన బిక్షను ప్రసాదించమని మ్రొక్కుకున్నారు.వారు అలా మ్రొక్కుకుని ముడుపు కట్టిన సంవత్సరం లోపే వారికి పండంటి మగ శిశువు జన్మించాడు.సుబ్రహ్మణ్యుని వర ప్రసాదం వలన జన్మించినందుకు ఆ శిశువుకు పళని వేల్ అనే పేరు పెట్టారు.

పళని వేల్ కు చిన్నతనం నుండే దైవ భక్తి మెండుగా ఉండేది.ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేవాడు.వృత్తి పరంగా అనేక వ్యాపారాలు చేసినా వాటిలో ధర్మం పాటించేవాడు.వ్యాపారంలో వచ్చే లాభాలలో సగం పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించేవాడు.

తారక మణి అనే వ్యక్తితో పళని వేల్ కు చిన్నతనం నుండి మంచి స్నేహం ఉండేది.ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవారు.తారక మణికి కూడా దైవభక్తి ఎక్కువే.

ఇదిలా ఉండగా ఒక సంవత్సరం తారక మణి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చి తనకున్న ఆస్తితో సహా మొత్తం కోల్పోయాడు.తన స్నేహితుని కష్ట దశను అర్ధం చేసుకున్న పళని వేల్ తారక మణిని పళని సుబ్రహ్మణ్య ఆలయానికి పిలిపించి ఆ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో తన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు.

తారక మణి ఆనందభాష్పాలతో తన స్నేహితుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో నమస్కరించాడు.అడుగకుండానే సహాయపడిన నీ గొప్ప మనస్సుకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.నీ బాకీని తీర్చగాలనేమో కానీ నీ వాత్సల్యానికి జన్మంతా ఋణపడే ఉంటాను అన్నాడు.

పళని వేల్ ఇలా అన్నాడు,ఇది అప్పు కానే కాదు,ఇందులో ఋణం అనే పదానికి చోటేలేదు.నా స్నేహితుని ఆపదలో ఆడుకోవడం నా కనేస ధర్మం.నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు అని.

ఇదంతా చూస్తున్న ఆ గుడి ఆవరణలో పూల వ్యాపారం చేసుకుంటున్న మురుగన్ అనే వ్యక్తి వారితో ఇలా అన్నాడు.మీలాంటి స్నేహితులను నేను ఇంతవరకూ చూడలేదు.ఎటువంటి బంధాలనైన త్రుంచే ప్రమాదమైన పదార్ధం " ధనం ".

ధనం ప్రభావం వలన మనుషుల మనస్తత్వం మారిపోతుంది.పళని వేల్ గారూ, మీరు చేస్తున్న సహాయానికి ఒక " ప్రామిసరీ నోటు " వ్రాసుకుంటే ఇరువురికీ మంచిది కదా అన్నాడు.

అందుకు పళని వేల్,ఇది అప్పుగా ఇస్తున్న ధనం కాదు,నా స్నేహితుని కష్టదశలో ఆడుకోవడం నా కనీస ధర్మం.ఇందులో ఋణ ప్రసక్తే లేదు అన్నాడు.

తారక మణికి పళని వేల్ వ్యక్తిత్వం అర్ధం అయ్యింది.తను వ్యాపారంలో లాభాలు పొందితే వాటి నుండి తన సంతోషం కోసం పళని వేల్ కు ఏదైనా కానుకగా ఇచ్చినప్పుడు అంగీకరిస్తాను అని ఒప్పుకుంటేనే ఈ సహాయం స్వీకరిస్తాను అని పట్టుబట్టాడు.

అందుకు పళని వేల్,నువ్వు నాకు కనుకలు ఇస్తే నువ్వు సంతోష పడవచ్చు నిజమే కానీ నేను కూడా సంతోష పడాలంటే నువ్వు మరొక పని చేయాలి అన్నాడు.

అదేమిటంటే నువ్వు నాకు కానుకలు ఇచ్చేబదులు వాటిని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలకూ, ఆలయ అభివృద్ధికీ , స్వామి వారిని దర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు , అన్నదానం కొరకు కర్చు పెట్టు నేను చాలా సంతోషిస్తాను అన్నాడు.అందుకు సంతోషంగా అంగీకరించాడు తారక మణి.

కొన్ని రోజులలోనే పళని వేల్ ఒక వర్తక నిమిత్తం విదేశాలకు వెళ్ళ వలసి వచ్చింది . తన స్నేహితుడు తారక మణిని పిలిచి తన ప్రయాణం గురించి వివరించి కొన్ని సంవత్సరాలు తాను విదేశాలలో వ్యాపారం చేసుకుని తిరిగి వస్తానని,నీకు వ్యాపారంలో లాభాలు వస్తే వాటిలో కొంత పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి కర్చు చేయమని ఒకవేళ లాభాలు రాణి పక్షంలో తన ఇంట్లో వారిని అడిగి తీసుకుని ఆలయానికి కర్చు చేయమని చెప్పాడు.అలాగే అని అంగీకరించాడు తారక మణి.

పళని వేల్ విదేశాలకు వెళ్ళి ఆరు సంవత్సరాలకు తిరిగి స్వదేశం వచ్చాడు.తన స్నేహితుడు తారక మణిని కలవడానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు.అప్పటికే కోట్లు సంపాదించిన తారక మణి పళని వేల్ ను గుర్తు పట్టనట్లు ప్రవర్తించాడు.ధన మదంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అర్ధం చేసుకున్న పళని వేల్ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఏమైనా కర్చు చేస్తున్నాడా అని వాకబు చేసాడు.

తారక మణి గత ఆరు సంవత్సరాలుగా ఆలయానికి ఏమి చేయలేదు అని , పళని వేల్ ఇంటి సభ్యులే కర్చు చేస్తున్నారని తెలుసుకున్నాడు.తన స్నేహితుడు ఇంతలా మారిపోయినందుకు , తనను గుర్తుపట్టనట్లు నటించినందుకు కూడా పళని వేల్ అంతగా బాధపడలేదు కానీ దేవుడ్ని మోసం చేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు.

మరొక్కసారి తారక మణిని కలుసుకుని దేవుడి సొత్తును దొంగిలించడం మంచిది కాదు,నువ్వు దేవుడికి చేయవలసిన కర్చును ఇప్పటికైనా చెల్లించు అని చెప్పాడు.అందుకు తారక మణి నేను దేవునికి చేస్తాను అని చెప్పాను అంటున్నావు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు.

దేవుడిని సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు.సరే అయితే ఆ దేవుడ్నే వచ్చి నాకు చెప్పమను అప్పుడు చేస్తాను అన్నాడు.తారక మణి వ్యంగ్య ధోరణికి మనస్తాపం చెంది,సరే కోర్టులోనే కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు.

పళని వేల్ తరఫున వాదిస్తున్న వకీలు,మన దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవూ ,కేవలం నోటి మాటలను కోర్టు నమ్మదు కనుక మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అన్నాడు.అందుకు పళని వేల్ ఈ సొత్తు దేవునిది,ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులను ఎలా రక్షిస్తాడు.దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా,మన ప్రయత్నం మనం చేద్దాం , తుది నిర్ణయం ఆ దేవునికే వదిలేద్దాం అన్నాడు.

ఆ రోజు రాత్రి పళని వేల్ కు ఒక స్వప్నం వచ్చింది.ఆ స్వప్నంలో అతను పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాడు.స్వామిని దర్శించుకుని తన మనసులోని బాధను,తను స్నేహితుడు చేసిన మోసాన్ని,దేవుడ్ని కూడా మోసం చేయాలనుకునే ఆలోచనల్ని తలచుకుని బాధపడుతుండగా వెనుక నుండి," అయ్యా ఎలా ఉన్నారు , చాలా సంవత్సరాల తరువాత మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాను,మీ వ్యాపారం ఎలా ఉంది , మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాటను నిలబెట్టుకున్నడా ? " అని ప్రశ్నించాడు.

అప్పుడు గుర్తొచ్చింది పళని వేల్ కు,నువ్వు మురుగన్ కదా,చాలా సంవత్సరాలు అయ్యింది కదా కనుక వెంటనే గుర్తుపట్టలేకపోయాను.నువ్వు ఎలా ఉన్నావు,ఎక్కడ ఉంటున్నావు,నా స్నేహితుడు నన్ను , దైవాన్ని కూడా మోసం చేసాడు.తను చేస్తాను అన్న సేవలేవి చేయలేదు,నన్ను కూడా ఎరుగనట్లు మాట్లాడుతునాడు.అందుకే కోర్టులో కేసు వేసాను.కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు,అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాను అన్నాడు.

అందుకు మురుగన్,మీరేమి దిగులు పడకండి,మీ దగ్గర నోటు లేకపోవచ్చు కానీ నేను ప్రత్యక్ష్య సాక్షిని కదా,నేను వచ్చి మీ తరఫున సాక్ష్యం చెబుతాను అన్నాడు.చాలా సంతోషం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు పళని వేల్.ఇక్కడు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను అన్నాడు మురుగన్.

వెంటనే పళని వేల్ కు మెలకువ వచ్చింది.తనకు వచ్చింది స్వప్నం అని గ్రహించాడు కానీ అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలుసుకోవాలని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు.మురుగన్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూడగా అక్కడ మురుగన్ కనిపించాడు.ఆశ్చర్యం , ఆనందం కలిగిన పళని వేల్ జరిగినదంతా చెప్పాడు.ఆ స్వప్నం కూడా సుబ్రహ్మణ్యుని లీలే అని ఆనందించారు.

కోర్టులో కేసు విచారణకు వచ్చింది.అప్పుడు పళని వేల్ తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మురుగన్ ను చూసి భయపడిపోయాడు తారక మణి.మురుగన్ మాటను నమ్మిన కోర్టు తారక మణి చేసిన మోసాన్ని గుర్తించి తన ఆస్తిలో పావు వంతు స్వామి వారికీ ఇవ్వాలని తీర్పునిచ్చింది.

కోర్టు ఆవరణలో పళని వేల్ ను కలిసి తారక మణిని ఇలా అడిగాడు,ఈ మురుగన్ ఎలా వచ్చాడు, ఎక్కడ నుండి వచ్చాడు,నేను నమ్మలేకపోతున్నాను అని.అందుకు పళని వేల్ నీతో మాట్లాడి వెళ్ళిన రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది అందులో నాకు మురుగన్ కనిపించాడు,తన చిరునామా చెప్పాడు,నేను ఉదయాన్నే తను చెప్పిన ఊరికి వెళ్లి చూసాను,అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు.తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను అన్నాడు.ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు అన్నాడు.

అందుకు తారక మణి,అసలు ఈ మురుగన్ మూడు సంవత్సరాల క్రితమే మన ఊరిలోనే మరణించాడు.తను నీకు కలలో కనిపించడం,చిరునామా చెప్పడం,నువ్వు వెళ్లి నిజంగానే కలవడం,తను ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం అంతా విచిత్రంగా ఉంది.ఆ మురుగన్ ఎవరో కాదు సాక్షాతూ ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారే.నేను తప్పు చేశాను,కోర్ట్ చెప్పిన దానికి రెండింతలు స్వామి వారి చేల్లిస్తాను అన్నాడు.

అప్పుడు అందరికీ అర్ధం అయ్యింది నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి వారే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని.ఇక్కడ సుబ్రహ్మణ్యుని పిలిస్తే పలుకుతాడు.

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి .

దయచేసి అందరికీ షేర్ చేయండి

అందరం " ఓం శరవణభవ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ
ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ
ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ
ఓం శరవణభవ

సేకరణ: సంభవామి యుగే యుగే గ్రూప్...

Friday, 7 September 2018

సాలిగ్రామం ఎలా పుట్టింది ?

* సాలిగ్రామం ఎలా పుట్టింది ?

సాలిగ్రామం అంటే తెలుసా.......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు.
అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.
ఆనది పేరు గండకీ.

చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!

            గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది.
ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.

గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది.
ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు.
ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.

            ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు.

అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన…
ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది.

సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది.

అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది.

ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది.

కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది.  శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.

            గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.

ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.

 మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.

            గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు.

ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

   గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||

Saturday, 7 July 2018

om

OM

ఇది హిమాచలప్రదేశ్ లోని జ్వాలముఖి దేవి ఆలయం...అష్టాదశ శక్తీ పీఠాలలో ఒక అత్యంత ప్రముఖమైనది...ఈ గుడిలో 9 దీపాలు అమ్మవారి 9 రూపాలుగా భావిస్తారు.ఇక్కడ ఎటువంటి విగ్రహం ఉండదు.ఇవి ఏ విధంగా వెలుగుతున్నాయో అని చాలా మంది పరిశోధనలు చేశారు..కానీ ఇప్పటికీ ఎటువంటి సమాధానం కనుక్కోలేకపోయారు....

జై శ్రీకృష్ణ

జై శ్రీకృష్ణ

కేరళలోని గురువాయూరప్ప దేవస్థానంలో పురుషులు చొక్కా తీసి దర్శనానికి వెళ్ళాలి ...కాని ఒక వ్యక్తి చొక్కా ధరించి దర్శనానికి వెళ్ళాడు.ఆ చొక్కా ఎలా తొలగింపబడిందో  తిలకించండి.....జై శ్రీకృష్ణ.🙏🙏🙏




కేరళలోని గురువాయూరప్ప దేవస్థానంలో పురుషులు చొక్కా తీసి దర్శనానికి వెళ్ళాలి ...కాని ఒక వ్యక్తి చొక్కా ధరించి దర్శనానికి వెళ్ళాడు.ఆ చొక్కా ఎలా తొలగింపబడిందో  తిలకించండి.....జై శ్రీకృష్ణ.🙏🙏🙏

Wednesday, 6 June 2018

kasireddy Nayana






అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు

అన్నము అంటే ఏమిటి ?
అన్నదానం అంటే ఏమిటి ?
అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?
అన్నదాన మహిమ చెప్పే కథ

అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...

అన్నము అంటే ఏమిటి ?

అన్నం పరబ్రహ్మ స్వరూపం !
మనలో చాలా మందికి " అన్నము " అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.
అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం .

అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు అని అర్ధం చేసుకోవాలి .

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది .

అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?

అన్నము ఇతర ఆహార పదార్ధాలను విక్రయించడం మహా పాపం అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుకే అన్నము దానము మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు .

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.
ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

                                            ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః




Saturday, 2 June 2018

om kasinayana




ఆత్మ ప్రకాశము వల్ల, బుద్ధి ప్రతిఫలించి, ప్రకాశించి బుద్ధి కర్మానుసారణి అనే పద్ధతిలో, బుద్ధి కర్మల విషయంలో చేయాల్సిన విధంలో కర్మ అనుభవం వచ్చిన తరువాత దానిని ప్రియంగానో, అప్రియంగానో ఎలా స్వీకరించాలనే విషయాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయం చేసే జ్ఞానం ఏదైతే ఉందో, అది ఆత్మ ఆత్మప్రకాశం యొక్క ప్రతిబింబించిన ప్రకాశం. ఇక్కడ ప్రకాశము అంటే జ్ఞానము. అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము యొక్క ప్రతిబింబ జ్ఞానమే బుద్ధి జ్ఞానము. శుద్ధ బుద్ధి అయితే రెండూ ఒక్కటే. ఆత్మప్రకాశము, బుద్ధి ప్రకాశము, బింబ, ప్రతిబింబ ప్రకాశములలో ఏ భేదము ఉండదు. కాని, బుద్ధి విషయాలతో కూడినప్పుడు. బుద్ధి ప్రకాశము విషయానుభవాన్ని ఇస్తుంది కానీ, ప్రకాశ అనుభవాన్ని ఇవ్వడం లేదు. ఈ రెండూ సూర్యరశ్మి ప్రకాశ మాత్రమున జరుగుచున్నాయి కాని, సూర్యరశ్మికి ఏ మాలిన్యము అంటటడం లేదు.

       ఇంకొక ఉదాహరణ. సూర్య ప్రకాశమువల్ల, సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై, మేఘమై, వర్షం పడుతోంది. సముద్రంలో ఉప్పునీరున్నా, ఉప్పునీటిలో కూడా మంచినీరే ఆవిరైనది. మురుగు గుంటలో నీరు కూడా ఎండ వేడికి ఆవిరైతే, మంచి నీరే లాక్కుంది. అది మేఘమై వర్షించింది. మంచి నీళ్ళు గాని, ఉప్పునీరు గాని, మురికి నీరు కాని, ఏ నీరైనా సరే, పేరుకు మలం ఉంది. మలము సూర్యప్రకాశముతో ఎండిపోయింది. ఆ మలంలో ఉన్నటువంటి ద్రవాన్ని కూడా ఆ సూర్యరశ్మి, ఆ సూర్య కిరణాలలో ఉన్నటువంటి వేడి, పీల్చి, ఆ శుద్ధ జలాన్ని మేఘరూపంలో పెట్టి, మళ్ళీ వర్షించింది. కనుక సూర్యరశ్మి ఉప్పునీళ్ళ మీద పడ్డా, మలినమైన నీళ్ళమీద పడ్డా, మలంమీద పడ్డా దేనిమీద పడ్డా వాటియొక్క మాలిన్యం సూర్యరశ్మికి ఎలా అంటలేదో, సూర్యుని యొక్క ఉష్ణత్వం వలన అన్ని పనులు ఎట్లా అవుతున్నాయో, అట్లా ఆత్మ వీటన్నింటికీ అసంగము. ఆత్మకు వీటన్నింటితో అంటు కానీ, సంగత్వం కానీ లేదు.

       అందుకే సమీపం అనే పదం వాడారు. ఉప - అని వాడుతూ ఉంటాము వేదాంతంలో. ఉప వాసము. సమీపంలో వశిస్తున్నాము. ఆత్మకు సమీపంగా వశిస్తున్నాము. ఆత్మే అయ్యావు అనేది కరెక్టు కాదు. అయితే సమీపంగా వశిస్తున్నాము అనే మాట భ్రాంతిలోనే. ఆత్మ వేరు, నేను వేరు అన్నప్పుడే కదా ఉపవాసము. కాని  నీవే ఆత్మవి అయినప్పుడు  భ్రాంతి పోయినప్పుడు నీవు ఆత్మవి. నీవే ఆత్మవి అయినప్పుడు ఆత్మకు సమీపంగా ఉండేది ఏముంది? అంటే, భ్రాంతిలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞాన నివృత్తి చేసుకుంటూ, భ్రాంతి రహితం చేసుకుంటూ, భ్రాంతిలో చేసే ప్రయాణంలో సమీపానికి వెళ్తాం. భ్రాంతి రహితం అయిన తరువాత, ప్రయాణమే లేదు. ఒక్క ముసుగు తొలగింది అంతే! ఒక తెర చినిగింది అంతే!

       తెర ఉన్నంత వరకూ స్వప్రకాశము స్వానుభవానికి రాలేదు. స్వయం ప్రకాశము స్వానుభవానికి రాలేదు. అజ్ఞాన ఆవరణ అనే తెర తొలగేసరికి, స్వస్వరూపము ఉన్నది ఉన్నట్లుగానే సాక్షాత్కరించింది. ఎక్కడినుంచో వచ్చిందా? ఎక్కడి నుండి రాలేదు. అలాగే ప్రతిబింబ ప్రకాశము వల్ల, విషయాలు గ్రహించబడి, విషయ జ్ఞానంగా మారింది. ఈ ప్రతిబింబ ప్రకాశము, బుద్ధిమీద పడి ప్రతిఫలించిన ప్రకాశము. ఆ ప్రకాశంలో బుద్ధియొక్క దోషాలన్నీ ఉంటాయి.




Friday, 1 June 2018








" మనం పుడితే తల్లి సంతోషించాలి 
          పెరిగితే తండ్రి ఆనందపడాలి 
       బ్రతికితే సమాజం సంబరపడాలి 
    చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి 
                   అదే  జీవితం అంటే  "

Tuesday, 3 April 2018

🕉 ఓం
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.
మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
       



🙏
                  🕉  ఓం

Saturday, 24 February 2018

Om

శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన..

కాశినాయనమండల పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న జ్యోతిక్షేత్రం. నిస్వార్ధ సాధువు గా, శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాల పునరుద్ధ్దరణకర్తగా, పలు జిల్లాల ప్రజలకు కాశిరెడ్డినాయన స్థిరపరిచితుడే. వివిధ ప్రాంతాలకు చెందిన కాశినాయన భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం చేరవేస్తూ, ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లలో సేవ చేస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయకతతో కనిపించే జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఆరాధన ఉత్సవాలకు దాదా పు రెండు లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఎంతమంది వచ్చినా అందరికీ రుచికరమైన రకరకాల వంటలు వండిపెట్టడం విశేషం. చిన్ననాటనే గొప్పయోగి కాగల చిన్నెలు వెల్లడికాగా ప్రాయమున గురూపదేశమయింది. యోగసాధనలో అత్యున్నత స్థాయిని అరదుకున్న అవధూత కాశిరెడ్డి నాయనగా ప్రసిద్ధుడైన మున్నెల్లి కాశిరెడ్డి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామానికి చెరదిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతుల కడుపు పంట కాశీవిశ్వేశ్వరుని ప్రసాదమే కాశిరెడ్డి. 1895లో సంక్రాంతి కనుమ పండుగ అయిన జనవరి 15 ఆదివారం నాడు జన్మించిన కాశిరెడ్డిని పుట్టుకతోనే దైవీగుణములు వెన్నంటినవి.
.
తల్లి కాశమ్మ ఒకనాడు తమ పొలంలో పని చేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాశిరెడ్డిని చంకన వేసుకుని పోయినది. ఆ బాలుడిని ఒక చెట్టు క్రింద పడుకోబెట్టి కూలీలకు అన్నం పెడుతున్నది. పట్టపగటి ఎండ శిశువు ముఖం మీద పడకుండా ఒక నాగుపాము పడగ విప్పి నీడపట్టినది. కాశిరెడ్డికి ఏ కీడు జరగనందుకు సంతోషంరచిన కాశమ్మ ఊరిపెద్దలకీ వింత చెప్పినది. వారు ఈ పసివాడు గొప్ప సిరిగల వాడవుతాడు లేదా గొప్పయోగి అవుతాడని అన్నారు. కాశిరెడ్డి ముద్దు ముచ్చటలు చూడకురడానే తండ్రి సుబ్బారెడ్డి కన్నుమూసాడు.
.
కాశమ్మ పిల్లలతో పుట్టిల్లు కొత్తపల్లెకు చేరుకున్నది. ఆమె తండ్రి అంబవరం బాలి రెడ్డి బిడ్డను ఆదు కున్నాడు. ఐదేళ్ళ కాశిరెడ్డి వేమూరి రామయ్య వీధి బడిలో గుణంతాలు, శతకాలు, అమరం, రామాయణ భాగవతాలు చదువుకున్నాడు. అక్క కాశమ్మకు మేనమామతో పెండ్లయినది. కాశిరెడ్డి స్వగ్రామం బెడుసుపల్లి భూములు పాలివారడ్లకు అమ్మి కొత్తపల్లిలో భూమి కొని, ఇల్లుకట్టుకుని వ్యవసాయం చేసాడు. కాలగతిలో అమ్మతాతలు, తరువాత కన్నతల్లి చనిపోయారు. వచ్చిన సంబంధాలు వివిధ కారణాల వల్ల నచ్చక కాశిరెడ్డికి పెళ్ళి కాలేదు.
.
యవ్వనంలోనే జిజ్ఞాసువైన కాశిరెడ్డి, కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొరడా రాఘవరెడ్డి సాంగత్యరతో వేదాంత గ్రంథాలు జీర్ణించుకోవడంతో, ఆయనలో వైరాగ్య బీజాలు పొటమరించాయి. కృష్ణాపురంలో అత్తిరాసు గురవయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయిరచాడు. గురవయ్య కొన్ని దినాలు కాశిరెడ్డిని పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారంనాడు పంచాక్షరీ, షడక్షరీ మంత్రాలుపదేశించి, హస్తమస్తక యోగం చేసి, తారకయోగము, షణ్ముఖీ ముద్ర సాధించే విధానము చెప్పి అనుదినం తన సాధనానుభవాలు చెప్పమ న్నాడు. కాశిరెడ్డి ఒక్కొక్క మెట్టు యోగం సాధించి గురువుకు తెలియజేశాడు. ఆయన శీఘ్రగతిని గ్రహించిన గురవయ్య నీవు అవధూతవవుతావని దీవించాడు.
.
కాశిరెడ్డి తన పొలం అక్క కాశమ్మకిచ్చి 1965 డిసెంబరులో ఇల్లు విడిచాడు. గ్రామాల్లో పురాణ కాలక్షేపాలు చేస్తూ వరికుంట్లలో శివాలయం జీర్ణోద్ధరణ చేసి, పెద్ద చిన్న అహోబిల క్షేత్రాలలో నరసింహదేవుని అర్చించి, గరుడాద్రి చేరాడు. అక్కడ ఒక పర్ణశాల ఏర్పరచుకుని తపస్సు చేసాడు. అయా చితంగా ఏది లభిస్తే అది తిని, గురువు చెప్పిన సాధనలు చేసి అష్టసిద్ధులను కైవశం చేసుకున్నాడు. తీవ్రసాధనతో ఆయనకు ఒకనాడు నిశ్చల సమాధి ఏర్పడి భగవత్సాక్షాత్కారం లభించినది. దేహం చాలించాలని అనుకున్న కాశిరెడ్డికి తాను చేయవలసిన పనులు జీర్ణదేవాలయోద్ధరణలు, నూతన దేవాలయాల నిర్మాణం, భక్తి జ్ఞాన వైరాగ్యముల ప్రచారం, నిత్యాన్నదాన కార్యమ్రాలు ఉన్నట్లు భగవదాదేశమైనది.
.
భగవదాదేశం నెరవేర్చడానికి కాశిరెడ్డి దేశ సంచారం ప్రారంభిరచాడు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కాశిరెడ్డి పలు జీర్ణమైన దేవాలయాలను, సమాధులను, కోనేరులను పునరుద్ధరించి, నూతన దేవాలయాలు నిర్మించి, అన్నసత్రాలు నిల్పి నిర్వహించాడు. ఆయన ధనికులకు, దరిద్రులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు చేసిన మేలు ఫలితమది. అది ఆయన దయాంతఃకరణం చేత, తపోబలం వల్ల సాధ్యమైనది.
.
గంగనపల్లె వీరారెడ్డి కాశినాయన శిష్యుడు. అతడు గురువుపై అలిగి కాశీకి బయల్దేరాడు. ఆ విషయం నాయనకు తెలిసి ”వాడెక్కడ పోతాడు? మధ్యనుండే తిరిగి వస్తాడు” అన్నారు. ఈ చర్చ మామిళ్ళపల్లిలో జరుగుతుండగా వీరారెడ్డి తిరిగి వచ్చాడు. చుట్టూ మూగిన జనం అడిగితే తాను రైలులో పోతురడగా నాయన వచ్చి తనమూట క్రిందికి దించి, తన రెక్కపట్టి రైలుబండి నుండి క్రిందికి లాగినాడన్నాడు. వీరారెడ్డి కాశినాయనను క్షమార్పణ కోరితే ”నీవు కాశీకి పోతే నిన్నెవరు సమాధిచేస్తారు? నీకు ఐదు దినాలలో మరణమున్నది” అన్నారు. అన్నట్లే వీరారెడ్డి ఐదవనాడు చనిపోతే 1986ఫిబ్రవరి 19న నాయన అతనికి సమాధి కట్టించాడు. గురువుల సమాధి కట్టించవలసిన శిష్యునికి గురువే సమాధి కట్టిరచాల్సి వచ్చింది. అదే దైవలీల!
.
గ్రామంలో కాశినాయన భానుమండలం లక్ష్మీనారాయణ ఆలయాన్ని బాగుచేయిస్తురడగా మొదటిసారి వచ్చిన కోట్ల విజయభాస్కర రెడ్డి గొప్ప భక్తుడయ్యాడు. అప్పుడే నీవు ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రివి అవుతావని నాయన దీవించాడు. కాలాంతరంలో ఆ దీవెన ఫలిరచిరది. కాశిరెడ్డి మహిమలు చూసిన వారు, మేలు పొందినవారు కొందరు ఆయనను నాయన అంటే మరికొందరు తాత అనేవారు.
.
పలు ప్రారతాల్లో పర్యటనలు, ఆనేక ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన నిర్మాణాలు 1995 సంవత్స రారతానికి పూర్తయ్యాయి. అన్నపూర్ణ, వినాయక ప్రతిష్ఠల కోసం కాశినాయన 1995 డిసెంబరులో లిరగాల కోన నురడి వచ్చారు. విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం తెల్లవారుఝామున కారులో వెళ్ళి కూచున్న ఆయన అక్కడే పరమాత్మలో ఐక్యమయ్యారు. తర్జన భర్జనల అనంతరం భక్తులు ఆయన పార్థివ దేహాన్ని యోగానందాశ్రమంలో విధివిధానోక్తరగా సమాధి చేసారు. సమాధి చెరత నిత్యార్చన, కార్తీక సోమ వారాలు, నాయన ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Om

శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన..
కాశినాయనమండల పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న జ్యోతిక్షేత్రం. నిస్వార్ధ సాధువు గా, శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాల పునరుద్ధ్దరణకర్తగా, పలు జిల్లాల ప్రజలకు కాశిరెడ్డినాయన స్థిరపరిచితుడే. వివిధ ప్రాంతాలకు చెందిన కాశినాయన భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం చేరవేస్తూ, ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లలో సేవ చేస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయకతతో కనిపించే జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఆరాధన ఉత్సవాలకు దాదా పు రెండు లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఎంతమంది వచ్చినా అందరికీ రుచికరమైన రకరకాల వంటలు వండిపెట్టడం విశేషం. చిన్ననాటనే గొప్పయోగి కాగల చిన్నెలు వెల్లడికాగా ప్రాయమున గురూపదేశమయింది. యోగసాధనలో అత్యున్నత స్థాయిని అరదుకున్న అవధూత కాశిరెడ్డి నాయనగా ప్రసిద్ధుడైన మున్నెల్లి కాశిరెడ్డి.
.
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామానికి చెరదిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతుల కడుపు పంట కాశీవిశ్వేశ్వరుని ప్రసాదమే కాశిరెడ్డి. 1895లో సంక్రాంతి కనుమ పండుగ అయిన జనవరి 15 ఆదివారం నాడు జన్మించిన కాశిరెడ్డిని పుట్టుకతోనే దైవీగుణములు వెన్నంటినవి.
.
తల్లి కాశమ్మ ఒకనాడు తమ పొలంలో పని చేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాశిరెడ్డిని చంకన వేసుకుని పోయినది. ఆ బాలుడిని ఒక చెట్టు క్రింద పడుకోబెట్టి కూలీలకు అన్నం పెడుతున్నది. పట్టపగటి ఎండ శిశువు ముఖం మీద పడకుండా ఒక నాగుపాము పడగ విప్పి నీడపట్టినది. కాశిరెడ్డికి ఏ కీడు జరగనందుకు సంతోషంరచిన కాశమ్మ ఊరిపెద్దలకీ వింత చెప్పినది. వారు ఈ పసివాడు గొప్ప సిరిగల వాడవుతాడు లేదా గొప్పయోగి అవుతాడని అన్నారు. కాశిరెడ్డి ముద్దు ముచ్చటలు చూడకురడానే తండ్రి సుబ్బారెడ్డి కన్నుమూసాడు.
.
కాశమ్మ పిల్లలతో పుట్టిల్లు కొత్తపల్లెకు చేరుకున్నది. ఆమె తండ్రి అంబవరం బాలి రెడ్డి బిడ్డను ఆదు కున్నాడు. ఐదేళ్ళ కాశిరెడ్డి వేమూరి రామయ్య వీధి బడిలో గుణంతాలు, శతకాలు, అమరం, రామాయణ భాగవతాలు చదువుకున్నాడు. అక్క కాశమ్మకు మేనమామతో పెండ్లయినది. కాశిరెడ్డి స్వగ్రామం బెడుసుపల్లి భూములు పాలివారడ్లకు అమ్మి కొత్తపల్లిలో భూమి కొని, ఇల్లుకట్టుకుని వ్యవసాయం చేసాడు. కాలగతిలో అమ్మతాతలు, తరువాత కన్నతల్లి చనిపోయారు. వచ్చిన సంబంధాలు వివిధ కారణాల వల్ల నచ్చక కాశిరెడ్డికి పెళ్ళి కాలేదు.
.
యవ్వనంలోనే జిజ్ఞాసువైన కాశిరెడ్డి, కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొరడా రాఘవరెడ్డి సాంగత్యరతో వేదాంత గ్రంథాలు జీర్ణించుకోవడంతో, ఆయనలో వైరాగ్య బీజాలు పొటమరించాయి. కృష్ణాపురంలో అత్తిరాసు గురవయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయిరచాడు. గురవయ్య కొన్ని దినాలు కాశిరెడ్డిని పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారంనాడు పంచాక్షరీ, షడక్షరీ మంత్రాలుపదేశించి, హస్తమస్తక యోగం చేసి, తారకయోగము, షణ్ముఖీ ముద్ర సాధించే విధానము చెప్పి అనుది


Friday, 19 January 2018

శ్రీ శ్రీ శ్రీ అవదూత కాశిరెడ్డి నాయన




వేదాలకు,యజ్ఞాలకు, ఉపనిషత్తులకు ఆవిర్భావభూమి మన భరతభూమి.ఈ సనాతన దివ్యభూమి సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో మహానుభావుడు అవతరించి సనాతనధర్మాన్ని కాపాడుతూ ఉంటారు.
అలాంటి మహానీయులే సద్గురు కాశీనాయనగారు.
నెల్లూరు జిల్లా,సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామంలో జన్మించిన కాశీనాయన నెల్లూరు,ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతమంతా నిరంతరం సంచరిస్తూ అందరిచేత ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహింపచేస్తూ దేనికీ తానుఅంటక వినిర్మల జీవన విధానమును కొనసాగించిన పరమపురుషులు.
* వెయ్యి నూతన ఆలయాలు నిర్మించేదానికన్న ఒక ప్రాచీన జీర్ణఆలయాన్ని ఉద్దరించమని పెద్దలు ఉవాచ.ఈ వాక్కుని కాశీనాయనగారు నిర్వర్తించిన విధంగా మరెవ్వరూ చేయలేదేమో.పవిత్ర నల్లమల పర్వతశ్రేణులతోపాటు వెలిగొండ పర్వత సానువులలో ఎన్నో పురాతన ఆలయాల్ని జీర్ణోద్ధరణ గావించడమే కాకుండా అనేక నూతన ఆలయాల్ని వారి సంకల్పబలంతో నిర్మింపచేశారు.ఆవిధంగా సనాతన భారతీయ సంస్కృతికి "గోపురం" ప్రాధాన్యతను అంధించిన అవతార పురుషులు శ్రీకాశీనాయన.

* అనాదిగా మన పవిత్ర భారతదేశములో గోమాతకున్న ప్రాధాన్యతను గుర్తించి అనేక  ఆశ్రములలో గోసంరక్షణ గావించుచూ "గోకులం" అవసరాలను తీరుస్తున్న మహాత్ములు శ్రీకాశీనాయన.

* నెల్లూరుజిల్లా ఆత్మకూరు నందు విద్యార్థులకు ఉచితవిద్యను అందిస్తుంది 'కాశీనాయన పాఠశాల'  విద్యార్థులకు మంచివిద్యను ఉచితంగా అందిస్తూ పాఠశాల ఆవరణలోనే గాయాత్రిమందిరం ఏర్పాటుచేసి విద్యార్థుల్లో దైవీక గుణాలను ఏర్పాటుచేస్తూ తద్వారా "గురుకులం" ఆవశ్యకతను తెలియచెపుతున్న సద్గురువు శ్రీకాశీనాయన.

ఈ వేదభూమికి పట్టుకొమ్మలైన "గోపురం గోకులం గురుకులం" యొక్క సేవలు అందించడంతో పాటు అనేక వందల ఆశ్రమాల్లో నిరతాన్నదానయజ్ఞాన్ని గావిస్తున్న సమర్ధ సద్గురువు కాశీనాయనగారు.

ఆ మహాత్ముని జన్మదినం సందర్భంగా వారిని స్మరిస్తూ వారిసేవలో నిత్యం తరిస్తూ వారి ఆశయాలను నిర్వర్తిస్తున్న గురుబందువులందరి పాదపద్మములకు నమస్కరించుకుంటూ......
                                                 మీ