Saturday, 24 February 2018

Om

శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన..
కాశినాయనమండల పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న జ్యోతిక్షేత్రం. నిస్వార్ధ సాధువు గా, శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాల పునరుద్ధ్దరణకర్తగా, పలు జిల్లాల ప్రజలకు కాశిరెడ్డినాయన స్థిరపరిచితుడే. వివిధ ప్రాంతాలకు చెందిన కాశినాయన భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం చేరవేస్తూ, ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లలో సేవ చేస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయకతతో కనిపించే జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఆరాధన ఉత్సవాలకు దాదా పు రెండు లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఎంతమంది వచ్చినా అందరికీ రుచికరమైన రకరకాల వంటలు వండిపెట్టడం విశేషం. చిన్ననాటనే గొప్పయోగి కాగల చిన్నెలు వెల్లడికాగా ప్రాయమున గురూపదేశమయింది. యోగసాధనలో అత్యున్నత స్థాయిని అరదుకున్న అవధూత కాశిరెడ్డి నాయనగా ప్రసిద్ధుడైన మున్నెల్లి కాశిరెడ్డి.
.
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామానికి చెరదిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతుల కడుపు పంట కాశీవిశ్వేశ్వరుని ప్రసాదమే కాశిరెడ్డి. 1895లో సంక్రాంతి కనుమ పండుగ అయిన జనవరి 15 ఆదివారం నాడు జన్మించిన కాశిరెడ్డిని పుట్టుకతోనే దైవీగుణములు వెన్నంటినవి.
.
తల్లి కాశమ్మ ఒకనాడు తమ పొలంలో పని చేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాశిరెడ్డిని చంకన వేసుకుని పోయినది. ఆ బాలుడిని ఒక చెట్టు క్రింద పడుకోబెట్టి కూలీలకు అన్నం పెడుతున్నది. పట్టపగటి ఎండ శిశువు ముఖం మీద పడకుండా ఒక నాగుపాము పడగ విప్పి నీడపట్టినది. కాశిరెడ్డికి ఏ కీడు జరగనందుకు సంతోషంరచిన కాశమ్మ ఊరిపెద్దలకీ వింత చెప్పినది. వారు ఈ పసివాడు గొప్ప సిరిగల వాడవుతాడు లేదా గొప్పయోగి అవుతాడని అన్నారు. కాశిరెడ్డి ముద్దు ముచ్చటలు చూడకురడానే తండ్రి సుబ్బారెడ్డి కన్నుమూసాడు.
.
కాశమ్మ పిల్లలతో పుట్టిల్లు కొత్తపల్లెకు చేరుకున్నది. ఆమె తండ్రి అంబవరం బాలి రెడ్డి బిడ్డను ఆదు కున్నాడు. ఐదేళ్ళ కాశిరెడ్డి వేమూరి రామయ్య వీధి బడిలో గుణంతాలు, శతకాలు, అమరం, రామాయణ భాగవతాలు చదువుకున్నాడు. అక్క కాశమ్మకు మేనమామతో పెండ్లయినది. కాశిరెడ్డి స్వగ్రామం బెడుసుపల్లి భూములు పాలివారడ్లకు అమ్మి కొత్తపల్లిలో భూమి కొని, ఇల్లుకట్టుకుని వ్యవసాయం చేసాడు. కాలగతిలో అమ్మతాతలు, తరువాత కన్నతల్లి చనిపోయారు. వచ్చిన సంబంధాలు వివిధ కారణాల వల్ల నచ్చక కాశిరెడ్డికి పెళ్ళి కాలేదు.
.
యవ్వనంలోనే జిజ్ఞాసువైన కాశిరెడ్డి, కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొరడా రాఘవరెడ్డి సాంగత్యరతో వేదాంత గ్రంథాలు జీర్ణించుకోవడంతో, ఆయనలో వైరాగ్య బీజాలు పొటమరించాయి. కృష్ణాపురంలో అత్తిరాసు గురవయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయిరచాడు. గురవయ్య కొన్ని దినాలు కాశిరెడ్డిని పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారంనాడు పంచాక్షరీ, షడక్షరీ మంత్రాలుపదేశించి, హస్తమస్తక యోగం చేసి, తారకయోగము, షణ్ముఖీ ముద్ర సాధించే విధానము చెప్పి అనుది


No comments:

Post a Comment

అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.*

 *ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చి...