Sunday, 15 December 2019

Jyothi temple

Jyothi temple

History, location, God and goddess:



Jyothi is a pilgrimage center, Which is located in nallamala forest area, Near Varikunta village, Kadapa district, Andhrapradesh. 


Jyothi temple can be categorized under religious place and also a popular tourist place in Kadapa district. Jyothi is the place of Sri Kasinayana or kasireddy nayana meditated for several years and become Lord. Jyothi is a place located in Siddhavatam mandal, Kadapa district of Andhra Pradesh.


According to census information Jyothi became a pilgrimage centre in Kadapa district. Here Jyothi Utsavams were celebrated every year. The devotees were comes from out of states also from other countries. The main deities are Jyotinatha Swami in the temple of Jyothi. Kasinayana Matham is located near Jyothinatha temple


Thursday, 5 December 2019

కాశీనాయన

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
Kasinayana
కాశీనాయన
Kasireddi nayana.png
కాశీనాయన
జననంనెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లి
నిర్యాణముడిసెంబర్ 6, 1995
కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని శ్రీ అవధూత కాశీనాయన మందిరం (కాశీనాయన సమాధి)
శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. కాశిమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు రెండవ సంతానం ఈయన. ఈయన పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను గురు అతిరాచ గురువయ్య స్వామిచే ప్రభావితుడయ్యాడు[1]. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమరి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. ఆయన డిసెంబరు 6, 1995 లో మరణించాడు.

కాశినాయన మండలం[మార్చు]

1995 డిసెంబరు 5వ తేదీ రాత్రి ( 1995 డిసెంబరు 6న ) మరణించిన ఈయన జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.

కాశినాయన ఆరాధనోత్సవాలు[మార్చు]

ఆయన పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశిరెడ్డి నాయన భక్తులు, కడప జిల్లాలోని కాశినాయన మండలం లోని జ్యోతి క్షేత్రంలో కాశి నాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్షెత్రం ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన ఏర్పాటు చేసారు.

కాశినాయన ఆశ్రమాలు[మార్చు]

జ్యోతి క్షేత్రమే కాకుండా కాశినాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు వందకు పైగా అశ్రమాలు, గుళ్ళు వెలిశాయి. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతు నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.

కాశినాయనపై పుస్తకాలు[మార్చు]

అతని జీవితంపై ఎన్నో పుస్తకాలు ముద్రించబడ్డాయి. వాటిలో శ్రీ కాశి నాయన పాదరేణువులు రచించిన సమర్థ సద్గురు కాశినాయన అనురాగ జీవితం ఒకటి.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

Monday, 2 December 2019

#రాయలసీమ..
#నిత్యాన్నధాన నిలయం కాశిరెడ్డి నాయన '#ఓంకారం'

కర్నూలుజిల్లాలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కడాలేని ప్రత్యేకత ఒకచోట ఉంది. అదే కాశిరెడ్డి నాయన నిత్యాన్నధాన నిలయం 'ఓంకారం'. కర్నూలుజిల్లా నంద్యాలకు సమీపంలోని ఆత్మకూరు మండలం ఈర్నపాడు నుంచి 8కిలోమీటర్ల దూరంలోని అడవీప్రాంతంలో ఈ ఓంకారేశ్వరస్వామి కోలువై ఉన్నాడు. ఇది కేవలం దైవం కోసం వెలసినది మాత్రమే కాదు. కొన్నివేల మందికి అనునిత్యం మూడుపూటలా భోజనం పెడుతున్న నిలయం. దేవుడు కొలువై ఉన్న చాలాచోట్ల అన్నధానాలు నిర్వహించడం చూస్తుంటాం... వాటన్నింటికి భిన్నమైన భోజనం ఇక్కడ పెడతారు. ప్రతిరోజు ఒక్కో రకమైన వంటకాలతో నిత్యం వేలమందికి ఇక్కడ భోజనం పెడతారు.

ఉదయం రకరకాల టిఫిన్‌ కూడా పెడతారు. వాటిలో దోశే, ఇడ్లీ, పొంగళి, సాంబారు అన్నం, పులిహోర, పులగం, చట్నీ, ఉగ్గాని(బోరుగులు లేదా మర్మరాలు), బజ్జీలు, ఉప్మా పెడతారు. మద్యాహ్నం రోజుకోక రకం ప్రసాదాలు, తీపి పదార్థాలు(స్వీట్‌)లు పెడతారు. వాటిలో ప్రధానమైనవి సేమీయా, సెనిగబేడలు కలిపి చేసే పరమాన్నం(పాయస్యం), మన ఇంట్లో కూడా కేవలం పండగ పబ్బాలకు కూడా అంతబాగా చేయలేరు. కానీ అక్కడ చేసే పాయస్యంలో బాదం, గోడంబీ, ఎండు ద్రాక్ష, కర్బూజ విత్తనాలు, యేలకలు, నెయ్యి దట్టంగా వేస్తారు. అంతేనా ప్రతి ఒక్కరికి నెయ్యిని విడిగా వడ్డిస్తారు. వీటికోసం అక్కడ దాదాపు 400 వందల ఆవులు మేపుతున్నారు. అవన్నీ కూడా భక్తులు,దాతలు  సమర్పించినవే. బచ్చాలు(బొబ్బట్లు), పూర్ణం కర్జికాయలు, బియ్యంపాయస్యం(అన్నంలోకి బెల్లం వేసి చేసేది), చెక్కర పొంగళి, వీటన్నికి తోడుగా మరోక స్వీట్‌ లడ్డూ, జిలేబి, కొవా కర్జికాయ, బాదుసా, పాలకోవ, కేసరి లాంటి ఏదో ఒకదానిని విదిగా పెడతారు.

ఇక అన్నం విషయానికి వస్తే పులిహోర, లేదా చిత్రాన్నం, అన్నం, పప్పూ, రసం, సాంబారు లేదా పచ్చి పులుసు, చట్నీ, ఊరగాయ, పెరుగన్నం, అప్పడం లేదా బొంగులు(గొట్టాలు), ఎంతకావాలంటే అంత పెడతారు. కొన్ని వందల ప్లేట్లు భక్లులు సమర్పించినవి అక్కడ ఒక పెద్ద డబ్బాలో పెట్టి ఉంటారు. ఎవరికి కావలసిన వారు వెళ్లి వాటిని తీసుకుని కడుపునిండా భోజనం చేయవచ్చు. ఎప్పుడు వినడమే కానీ పోయి చూసింది లేదు.ఓ వివాహానికి ఈర్నపాడుకు వెళ్లినప్పుడు పక్కనే ఉంది వెలదామని బలవంతపెడితే వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత ఈ కలికాలంలో ఇంత బాగా కాశిరెడ్డి నాయన అశ్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఉన్నారా..? అనిపించింది.

నిజానికి చాలా ట్రస్టులు, దేవాలయాల దగ్గర ఇలా నిత్యాన్నధానాలు నిర్వహిస్తున్నారు కానీ ఈ తరహా చేస్తున్న వారిని నాకు తెలిసి ఇక్కడ మాత్రమే చూశాను. అలాగే అక్కడే కొండ పైకి 4 కిలోమీటర్లు కాలినడకన వెళితే కాలజ్ఞాని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నిర్మించిన కొలను, కొలను భారతీ అమ్మవారితో పాటు ఒకే శిలపై ఇటు వెంకటేశ్వర స్వామి, వెనుక పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. వీటిని చూడటానికి కొండపైకి రాళ్ల బాటలో నడిచి వెళ్లాలి. అక్కడ కూడా నిత్యాన్నధానం  భోజనం పెడుతున్నారు. పైన కూడా ప్రసాదంగా పులిహోర, అవు పెరుగుతో చేసిన కమ్మని పెరుగన్నం, లడ్డూ పెడతారు. అవి ఎంత కమ్మగా ఉన్నాయో చెప్పడానికి లేదు. నేను రెండుసార్లు పెట్టించుకుని తిన్నాను. మాకు ఒకసారి కొండపైకి ఎక్కడానికే కష్టం అనిపించింది.. కానీ వారు కింది నుంచి అన్నిటిని మోసుకుని వెళ్లి పెడతారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాఫీ కూడా పోస్తారు. అక్కడ సాధువులు, పిల్లలు వదిలించుకున్న, వాళ్ల మీద విరక్తి చెంది వచ్చిన తల్లిదండ్రులు, అనాధలు ఎంతోమంది ఉన్నారు.

అక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో వారు కూడా చేదోడువాదోడుగా ఉంటూ శక్తి ఉన్నంతమేరకు సహాయ సహాకారాలు అందిస్తూ శేషజీవితాన్ని గడిపేస్తున్నారు. అక్కడ ఉన్న ఒక వృద్ధ దంపతులను పలకరించగా కన్నపిల్లల చేత ఈసడించుకోవడం కంటే ఇదే ఉత్తమం కదా నాయనా... దైవ సన్నిధిలో ఎందరికో భోజనం వడ్డిస్తూ... వారి ఆశీర్వచనాలతో పోవడం కంటే స్వర్గప్రాప్తి ఉంటుందా అన్నారు. ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇలా అక్కడ ఉన్న చాలామంది వృద్ధులకు ఒక్కోక్కరికి ఒక్కో ధీనగాధ ఉంది. మరి ఇంతమందికి ఇంత రుచికరమైన భోజనం ప్రతిరోజు ఎలా పెడుతున్నారని ఆరాతీయగా చుట్టూపక్కల వందల గ్రామాల ప్రజలు తమకు పండిన వరి పంటలో 1నుంచి 2శాతం కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి తెచ్చి ఇస్తారట. అంతేకాకుండా ఎవరికి తోచిన సహాయ సహకారాలు అందిస్తారట. దేశ విదేశాల్లో ఉన్న భక్తులు, దయాగుణం కలిగిన దాతలు సహాయం చేస్తారట. కాశిరెడ్డి నాయన జీవించి ఉన్నప్పుడే  ఇక్కడే కాకుండా మరో 18చోట్ల ఇలానే నిత్యాన్నధానాన్ని నిర్వహిస్తున్నారని అక్కడి పూజారి చెప్పుకొచ్చారు. నిజంగా వారికి చేతులేత్తి నమష్కరిస్తున్నాను వేలమంది ఆకలి తీర్చుతున్నందుకు...!